Wednesday, July 29, 2009

ఒక టెర్రరిస్టు బాధ(కల్పితం)

ఇది ఒక టెర్రరిస్టు , అతని బాస్ కి మధ్య జరిగిన సంభాషణ. ఇద్దరు పాకిస్తాన్ లో ఉన్నారు.

బాస్: నీకు ఒక గొప్ప పని చెపుతున్నాను. నువ్వు ఇంకొక 10 మంది కలిసి మన శత్రువు మీద దాడి చెయ్యాలి.
టెర్రరిస్టు : నేను ఆ పని చెయ్యను. చెయ్యలేను.
బాస్: పెద్దలు చెప్పిన మాట వినక పోతే, మన శత్రువు ని చంపక పోతే నిన్ను అల్లా మన్నించరు.
టెర్రరిస్టు : నేను మిమ్మలిని దిక్కరించటం లేదు కానీ మా బాధ కూడా అర్ధం చేసుకోండి.
బాస్ : ఇది చేసినందుకు మీకు ఒక్కొకారికి 5 లక్షలు ఇస్తారు. మీరు చనిపోతే మీ వాళ్ళని ఏ లోటు లేకుండా చూసుకుంటారు.
టెర్రరిస్టు : అవి అన్ని నిజమే కానీ...
బాస్ : కానీ ఏంటి ఇంకా
టెర్రరిస్టు : నాకు ఎందుకో మనసు రావటం లేదు ఈ పని చెయ్యటానికి.
బాస్ : శత్రువు ని చంపటానికి వెనకాడుతున్నావా?
టెర్రరిస్టు : కాదు కానీ మేము చేసినాదాని ఉపయోగం ఏదయినా ఉంటుందా?
బాస్: ఎందుకు ఉండదు? మన శత్రువు ని చావు దెబ్బ కొడాదాము.
టెర్రరిస్టు : మేము దాడి చేస్తే ఎంత మంది చనిపోతారు?
బాస్ : మన లక్ష్యం 100 మంది. దొరికితే ఇంకా ఎక్కువ మందిని ఛంపండి.
టెర్రరిస్టు : చంపితే?
బాస్: మన శత్రువు కి మన సత్తా తెలుస్తుంది. మన అన్నదమ్ములని హింసిస్తున్నందుకు వాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలి.
టెర్రరిస్టు : ఆది సరే కానీ మేము 100 మందిని చంపితే మన శత్రువు ప్రతిచర్య ఎలా ఉంటుంది?
బాస్ :(మౌనం)
టెర్రరిస్టు: చెప్పండి...
బాస్ :(మౌనం)
టెర్రరిస్టు :అర్ధం అయ్యిందా నేను ఈ పని ఎందుకు చెయ్యకూడదు అనుకుంటున్నామో..
బాస్ : కానీ..
టెర్రరిస్టు : మా బాధ కూడా వినండి. మేము ఇక్కడి నుంచి ఎంతో కష్టపడి మన శత్రువు దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఒకరి లాగా కలిసి పోయి వాళ్ళ మీద దాడి చేస్తాము. ఒక 100 - 200 వందల మందిని మట్టు పెడతాము. ఇది అంతా చేసినందుకు మాకు మీరు డబ్బులు కూడా ఇస్తారు కానీ మేము ఇది చేసేది ఒక్క డబ్బు గురించే కాదు, మన శత్రువు వాళలో ఒక్కడు చనిపొయినా, 100 మంది చనిపొయినా పడే బాధ చూసి ఆనందించటానికి. కానీ ఆది జరగదు. మేము ఎంత మందిని ఛంపినా మరుసటి రోజు ఏమీ జరగనట్టే అందరు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. నిన్న ఎంత మంది పోయారు అని క్రికెట్ స్కోర్ అడిగినట్టు అడుగుతారు తప్ప నిజం గా బాధ పడి కాదు. పోయిన ఏడాది ముంబై లో ట్రైను లో బొంబులు పెట్టి 150 మందిని చంపి గర్వంగా తిరిగి వస్తే ఆ తరువాత రోజు అదే దారిలో మళ్లీ జనాలు తిరుగుతున్నారు అని తెలిసి చాలా బాధ పడ్డాము. అసలు నిన్న అక్కడ ఏమీ జరగనట్టు ఉన్నారు అందరు. ఎవరో వాళ్ళ వాళ్ళు పోతే వాళ్ళు బాధ పడ్డారు తప్ప వేరే వాళ్ళు వల్ల పని వాళ్ళు చేసుకున్నారు. మొన్న అదే ముంబై లో హోటెల్ లో కి వెళ్ళి 200 వందల మందిని ఛంపుతూ ఉంటే దానిని టీవీ లో రోజుల తరబడి చూస్తూ కూర్చున్నారు. మాకు ఫోన్ చేసి కూడా మాట్లాడారు టీవీ వాళ్ళు. పొరపాటున మాలో ఒక్కడు దొరికి పోయాడు. వాడికి అసలు ఎక్కడ ఉన్నడో అర్ధం కావటం లేదు. టైమ్ కి తిండి, చికన్ బిర్యానీ తో, మంచి బట్టలు, చదువుకోటానికి పుస్తకాలు, చూడటానికి టీవీ, కావలసినంత హంగామా. ఈ సారి కూడా మాలో ఎవరినా పోలీసులకి దొరికితే వాడు జీవితాంతము బ్రతక కుండా చావకుండా అలా కోర్టుల మధ్య నాలిగి పోవలసిందే. కొన్ని రోజులకీ వాడికే చికాకు పుట్టి నేనే చేశాను బాబోయి అన్నా, అంతా ఒప్పుకున్న కూడా వాళ్ళు ఆది కూడా నాటకమే అని దాని మీద కోర్టులో వాదనలు. ఇక మేము ఇంత కాస్త పడింది మన శత్రువు కి చీము నెత్తురు ఉంటే మన తో యుద్ధం చెయ్యటానికి వస్తాడు, అప్పుడు చూసుకుందాము అనుకుంటే ఆది కూడా అవ్వతం లేదు. అక్కడి నాయకులు అందరు ఇది జరిగినందుకు ఇంత మంది చనిపోయినందుకు చింతిస్తున్నాము, టెర్రరిస్టుల ఆట కట్టిస్తాము అనే అంటారు తప్ప ఎలా కట్టిస్తారో చెప్పారు. మళ్లీ ఏది అయినా పెద్ద గొడవ జరిగే అంత వరకు మళ్లీ మాట ఎత్తారు. వాళ్ళ ప్రజలు అన్నా ఇది మనసు లో పెట్టుకుని ఎలెక్షన్ ల లో ఓటు వేస్తారా అంటే అదీ లేదు. ఇలా అయితే మన వాళ్ళు నీరసించి పని చెయ్యలేక మన శత్రువు దగ్గరికే వెళ్ళి వాళ్ళ సన్యాసులలో కలిసి పోయే ప్రమాదం ఉంది.
బాస్ :(మౌనం)
టెర్రరిస్టు : చెప్పండి ఏమీ చెయ్యమంటారో
బాస్ : ఓరాయ్ పిచీ సన్నాసి, ఒక దొంగ ని పట్టుకుని శిక్షిస్తే వాడు మళ్లీ బయటకి వచ్చాక అదే మార్గం అనుసరిస్తాడు. ప్రతీకారం తీర్చుకోటానికి ప్రయత్నిస్తాడు. అదే వాడిని అందరి ముందు నిలబెట్టి వీడు దొంగ అని ముద్ర వేసి వదిలేస్తే వాడే కుళ్ళి కుళ్ళి చస్తాడు. మళ్లీ ఆ పని చెయ్యటానికి సాహసించాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. కానీ మనకి చీము నెత్తురు లేదు కాబట్టి మనం మళ్లీ అవే దాడులు చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాము. మన శత్రువు కూడా ఒకే తప్పు చేస్తున్నాడు కాబట్టే మనం ఇంత సాహశిస్తున్నాము. అదే ఒక్క సారి అయినా ఎదురు తిరిగి మన మీద దాడి చేస్తే ఇవి అన్ని కొన్ని రోజులు జరగవు. వాళ్ళు ఆ పని చెయ్యరు. మనం ఇంత పెద్ద దాడి చెయ్యగలుగుతున్నాము అంటే మనకి ఆ దేశం లోనే మిత్రులు ఉన్నారు. వాళ్ళ సాయం తోనే మనం ఏది అయినా చెయ్యగలం. మనం చేసే వాటిని తట్తుకోవాలి అంటే ముందు వాళ్ళ దేశం లో మనకి సహాయం చేసే వాళ్ళని పట్టుకుని కఠినం గా శిక్షిస్తే ఇవి అన్ని తగ్గుతాయి. ఆది జరగదు ఎందుకంటే అక్కడ నాయకులకి పదవి భయం. మన వాళ్ళని ముట్టుకుంటే రాబోయే ఎలెక్షన్ ల లో మన వాళ్ళ ఓట్లు పడవు అనే భయం. ఆది ఉన్నంత సేపు మనకు ఏ భయము లేదు. మనం మన పని చేసుకు పోవలసిందే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకు పోతారు. ఇది ఆగదు!!!!

3 comments:

సుభద్ర said...

very nice.

Gopal said...

చాలా బాగా చెప్పారు. ఇది బ్లాగులో కాదు ఈ మెయిల్ ద్వారా భారతీయులందరికీ పంపాలి.

Telugu Vilas said...

good post thanks for sharing Telugu Vilas